Tuesday 10 July 2012

sagatujeeviki kastam

సగటు జీవికి కష్టం

సగటు మానవుడు ఇప్పుడున్న పరిస్థితులలో జీవించడం కష్టంగా మారుతుంది. ఎప్పటికప్పుడు పెరుగుతున్న ధరలతో సామాన్యుడు కుదేలవుతున్నాడు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు సామాన్యుల జీవనం సాఫీగా  కొన సాగేలా చూడాలి.  కనీసం మూడు పూటలా తిండి తినేలా,  తలదాచుకోవడానికి  సొంత ఇళ్ళు ఉండేలా సహా యం చేయాలి. ప్రస్తుతం పెరుగుతున్న ధరలు సామాన్యుడుని ఆందోళన పరుస్తున్నాయి. పేదవర్గాలను గుర్తిం
చి వారి అభివృద్దికి కృషి చేయాలి.  అదేవిధంగా  అనారోగ్యానికి గురైనా వైద్య ఖర్చు పెరగడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. చిన్నపాటి రోగాలకు సైతం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ పరిస్థితు
లలో పేదలు వైద్యం చేయించుకోలేకపోతున్నారు. ఇక పెద్దరోగాల భారిన పడితే కార్పోరేట్ ఆసుపత్రులలో లక్ష
ల రూపాయలు ఖర్చు చేయలేక ప్రాణాలు వదులుతున్నారు. భారత్ లాంటి పేద , మధ్యతరగతి ప్రజలు ఎక్కు
వ ఉన్న దేశాలలో వారి కనీస అవసరాల తీర్చుకునేందుకు ప్రభుత్వాలు వీలుకల్పించాలి. మూడుపూటలా ఆ
హారం తీసుకునేందుకు నిత్యావసరాల ధరల అదుపునకు ప్రభుత్వాలు ప్రాధాన్యతనివ్వాలి. పేద , మధ్యతరగతి ప్రజలు తలదాచుకోవడానికి తక్కువ ధరలలో ఇండ్లు నిర్మించి ఇవ్వాలి. దీర్ఘకాలిక సమయంలో ఇంటి లోను
లను తక్కువ వడ్డీతో చెల్లించే వీలు కల్పించాలి. అలాంటి చర్యలు తీసుకునే ప్రభుత్వాలకు పేద , మధ్యతరగతి
వర్గాల మద్దతు లభిస్తుందనడంలో సందేహం లేదు.
                                                                                 - T.Yogendar